ADDA -2021 Vinayaka Chavithi Flxe Designing
వినాయక చవితి, భారతీయుల అతిముఖ్య పండుగలలో ఇది ఒక పండగ. పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు.[1] భాద్రపదమాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.చరిత్ర
1892 లో ప్రజా వ్యతిరేక అసెంబ్లీ చట్టం ద్వారా హిందూ సమావేశాలపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య తిలక్, బ్రిటీష్ వారిపై భారత స్వాతంత్ర్యోద్యమం మద్దతుగా ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తి రగిలించే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టలేదు. దేశవ్యాప్తంగా అందరినీ ఒక్కటి చేసే సంకల్పంతో ఇప్పుడు నిరంతరంగా సాగుతున్న గణపతి ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు మొదటిసారిగా ప్రారంభించి సాధించాడు.[2] భారతీయుల పూజా మందిరాల్లో జరిగే గణేశ పూజకు సామూహికమైన, సామాజికమైన, సార్వజనీనమైన ప్రాధాన్యత అందించడంలో అతను చేసిన కృషి అనన్య సామాన్యం.
పూజా విశేషాలు
వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు.[3][4]
మాచీ పత్రం/మాచిపత్రి -
బృహతీ పత్రం/ములక
బిల్వ పత్రం/మారేడు
దూర్వా పత్రం/గరిక
దత్తూర పత్రం/ఉమ్మెత్త
బదరీ పత్రం/రేగు
అపామార్గ పత్రం/ఉత్తరేణి
తులసీ పత్రం/తులసి
చూత పత్రం/మామిడి
కరవీర పత్రం/గన్నేరు
విష్ణుక్రాంత పత్రం/శంఖపుష్పం
దాడిమీ పత్రం/దానిమ్మ
దేవదారు పత్రం/దేవదారు
మరువక పత్రం/ధవనం, మరువం
సింధువార పత్రం/వావిలి
జాజి పత్రం/జాజిమల్లి
గండకీ పత్రం/లతాదూర్వా (కామంచి ఆకులు)
శమీ పత్రం/జమ్మి
అశ్వత్థ పత్రం/ రావి
అర్జున పత్రం/ తెల్ల మద్ది
అర్క పత్రం/జిల్లేడు.
విఘ్నేశ్వరుని కథ
సూత మహాముని శౌనకాది మహా మునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు.
పూర్వం గజ రూపం కల రాక్షసుడొకడు పరమ శివుని కొరకు ఘోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై 'భక్తా! నీ కోరికేమి?' అని అడుగగా, ఆ రాక్షసుడు, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరం నందే నివసించాలి' అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి, గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు.
కొద్ది రోజులకు పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి, మహా విష్ణువును ప్రార్థించి, 'ఓ దేవదేవా! ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుని బారి నుంచి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో, మహా శివుని కాపాడవలసింది' అని వేడుకుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు.
శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయంగా తలచి, నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి, గజాసురుని పురానికి వెల్లి సన్నాయి వాయిస్తూ, నందిని ఆడించారు. దానికి తన్మయుడైన గజాసురుడు 'మీకేం కావాలో కోరుకోండి!' అనగా, విష్ణుమూర్తి 'ఇది మహమైన నందీశ్వరుడు. శివుని వెతుక్కుంటూ వచ్చింది. కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చెయ్యి' అని అడిగాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు, సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి, శివునితో 'నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేటట్లుగా అనుగ్రహించి, నా చర్మం నీ వస్త్రంగా ధరించమని' వేడుకొన్నాడు.
అభయమిచ్చిన తరువాత, విష్ణుమూర్తి నందికి సైగ చేయగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు. బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు విష్ణుమూర్తి 'ఇలా అపాత్ర దానం చేయకూడదు. దుష్టులకిలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టవుతుంది' అని చెప్పి అంతర్థానమయ్యాడువినాయక నిమజ్జనం
భాద్రపద శుద్ధ చవితి తరువాత వినాయకుడికి నవరాత్రి పూజలు చేసిన తరువాత, మట్టి వినాయకులను ఆడంబరంగా తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న నదిలో కాని సముద్రంలో కాని నిమజ్జనం చేస్తారు.
Post a Comment
0 Comments